సికింద్రాబాద్, వెలుగు: ఓ యువకుడు బైక్లతో చోరీ చేసి వాటితో ఫీట్లు చేస్తూ రీల్స్తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసి చివరకు పోలీసులకు చిక్కాడు. నిందితుడి వద్ద వివిధ కంపెనీలకు చెందిన 9 బైక్ లను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు పంపారు. నార్త్జోన్డీసీపీ రోహిణి ప్రియదర్శిని మంగళవారం మీడియాకు తెలిపారు. చాంద్రాయణగుట్టకు చెందిన షేక్ ఇబ్రహీం(19) బైక్లపై ఫీట్లు చేయడం సరదా. వివిధ రకాల బైక్లపై ఫీట్లు చేయాలనుకుని, బాలుడితో కలిసి బైక్ చోరీలు చేశారు. నంబర్ ప్లేట్లు మార్చి రోడ్లపై బైక్ లతో ఫీట్లు చేస్తూ రీల్స్చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసేవాడు. అనంతరం ఆ బైక్లను పార్టులుగా విడగొట్టి అమ్మేవాడు.
వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేసేవాడు. ఇలా ఇద్దరూ కలిసి ఎస్ఆర్నగర్, హుమాయున్నగర్, ఫిల్మ్నగర్,రామ్గోపాల్పేట్, బేగంపేట్ పీఎస్ పరిధిల్లో బైక్లను చోరీ చేశారు. ఈనెల13న బేగంపేట్లోని ఓ షాపింగ్మాల్వద్ద పార్క్చేసిన జూపిటర్ బైక్ కనిపించడం లేదని స్మితాపాటిల్అనే మహిళ పోలీసులకు కంప్లయింట్ చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాల ఫుటేజీలను చెక్ చేశారు.
బేగంపేటలో బైక్ ను చోరీ చేసి చాంద్రాయణగుట్ట షాహిన్నగర్లో నంబర్ ప్లేటు మార్చి తిరుగుతున్నట్లు గుర్తించారు. ఆ బైక్ ను స్వాధీనం చేసుకుని చాసిస్నంబరు ఆధారంగా పోలీసులు పరిశీలించారు. అది బేగంపేట్లో చోరీకి గురైన జూపిటర్ బైక్ గా తెలిసింది. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా బైక్ లను చోరీ చేసినట్టు చెప్పారు. షేక్ ఇబ్రహీంను రిమాండ్కు, బాలుడిని జువెనైల్ హోమ్కు పంపారు.