క్షమాపణ చెప్పిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి

క్షమాపణ చెప్పిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి

తాను చేసిన కాంట్రవర్సీ కామెంట్స్ కు క్షమాపణ చెప్పారు మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి. మున్సిపాలిటీ సమస్యలపై ఫ్లోలో మాట్లాడానే తప్ప, ఉద్దేశపూర్వకంగా అనలేదన్నారు. ఈ నెల 21న జరిగిన మక్తల్ మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో మున్సిపల్ చైర్ పర్సన్, మహిళా కౌన్సిలర్లపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే. మున్సిపాలిటీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో బీజేపీ దక్కించుకున్న ఏకైక మున్సిపాలిటీ మక్తల్. దీంతో TRS- BJP మధ్య పొలిటికల్ హీట్ నడుస్తూనే ఉంది. రీసెంట్ గా కౌన్సిలర్లను ఎమ్మెల్యే టార్గెట్ చేయడంతో విమర్శలొచ్చాయి. దీంతో తన వ్యాఖ్యలకు సారీ చెప్పారు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి.