
గోదావరిఖని, వెలుగు: సరస్వతీ పుష్కరాల సందర్భంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను దేవాదాయశాఖ అధికారులు అవమానించడం సరికాదని మాలసంఘం రామగుండం కార్పొరేషన్ ఏరియా అధ్యక్షుడు కొండ కుమార్ అన్నారు. శుక్రవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
గతంలోనూ సింగరేణికి చెందిన పలు కార్యక్రమాల్లో ఎంపీ పేరును శిలాఫలకాలపై పెట్టకుండా అవమానించారన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీటింగ్లో లీడర్లు గడ్డం నారాయణ, కడమండ శ్రీహరి, లింగమూర్తి, తదితరులు పాల్గొన్నారు.