
- ఉన్నత విద్యా మండలి చైర్మన్కు మాల మహానాడు విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: యూజీసీ రూల్స్ కు విరుద్ధంగానడుస్తున్న భూదాన్ పోచంపల్లిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని మాల మహానాడు అధ్యక్షుడు పిల్లి సుధాకర్ డిమాండ్ చేశారు. మేనేజ్ మెంట్నిర్లక్ష్యంతో ఇటీవల దళిత విద్యార్థి మరణించారని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఈ అంశంపై ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్టారెడ్డి, వైస్ చైర్మన్ పురుషోత్తంను మసాబ్ ట్యాంక్లోని కౌన్సిల్ ఆఫీస్ లో కలిసి వినతిపత్రం అందచేశారు.
కాలేజీ సమీపంలోని క్వారీ గుంతలో మునిగి స్టూడెంట్ మరణించారని, రెండు నెలల అవుతున్నా ఈ ఘటనపై మేనేజ్ మెంట్ వివరణ ఇవ్వలేదని సుధాకర్ తెలిపారు. మాల మహానాడు ఆధ్వర్యంలో కాలేజీని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ ఘటనను విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చైర్మన్, వైస్ చైర్మన్లు హామీ ఇచ్చారని సుధాకర్ వెల్లడించారు. చైర్మన్, వైస్ చైర్మన్ను కలిసిన వారిలో స్టూడెంట్ తండ్రి బొడ్డు భాను ప్రతాప్, నేతలు రజని, నర్సింగరావు, మహేందర్, హరి ఉన్నారు.