
హైదరాబాద్, వెలుగు : మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ 2023–-24 సంవత్సరానికి ‘ఇండియా గోల్డ్ కాన్ఫరెన్స్ (ఐజీసీ) రెస్పాన్సిబుల్ జ్యువెలరీ హౌస్ అవార్డును దక్కించుకుంది. బాధ్యతాయుతమైన మూలాల నుంచి బంగారం సేకరించడం, వ్యాపార కార్యకలాపాల్లో సుస్థిరత పాటించినందుకు ఈ గౌరవం దక్కింది.
చట్టబద్ధమైన గనుల నుంచి తవ్విన బంగారాన్ని మాత్రమే కొంటున్నదని సంస్థ ప్రకటించింది. బెంగుళూరులో జరిగిన కార్యక్రమంలో ఇండియా గోల్డ్ పాలసీ సెంటర్ చైర్పర్సన్ నారాయణస్వామి నుంచి మలబార్ తరపున ఇండియా ఆపరేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆషర్ ఈ అవార్డును అందుకున్నారు.