- ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
- నేపథ్యంలో పోలీసుల నిర్ణయం
హైదరాబాద్ సిటీ, వెలుగు: మలక్పేట్ ఫైర్ స్టేషన్ నుంచి యాదగిరి థియేటర్ వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ పనుల నేపథ్యంలో పోలీసులు గురువారం నుంచి 2 నెలల పాటు ట్రాఫిక్మళ్లింపులను అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా సైదాబాద్ వై -జంక్షన్ నుంచి ఐఎస్ సదన్ వరకు ఒకవైపు రోడ్డును పూర్తిగా మూసేస్తున్నామని చెప్పారు. నల్గొండ ఎక్స్ రోడ్ నుంచి ఓవైసీ హాస్పిటల్ వరకు భారీ రద్దీ ఉండే అవకాశం ఉన్నందున, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు, నల్గొండ ఎక్స్ రోడ్ నుండి వచ్చే వాహనాలు సైదాబాద్ వై -జంక్షన్ వద్ద ఎడమకు తిరిగి.. సైదాబాద్ పోలీస్ స్టేషన్ – సరస్వతి నగర్ కమాన్ – సంకేశ్వర్ బజార్ – సింగరేణి కాలనీ – ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ – చంపాపేట్ మెయిన్ రోడ్ మీదుగా ఐ.ఎస్ సదన్ చేరుకోవాలి.
చంచల్గూడ నుంచి ఐ.ఎస్.సదన్ వైపు వెళ్లేవారు సైదాబాద్ వై-జంక్షన్ వద్ద నుంచి – 105 బస్ స్టాప్ వద్ద కుడి వైపు తిరిగి రామాలయం కమాన్ – లక్ష్మీనగర్– బిస్కట్ ఫ్యాక్టరీ –దోబీ ఘాట్ జంక్షన్ మీదుగా ఐఎస్ సదన్ మెయిన్ రోడ్డుకు చేరుకోవచ్చు.
చంపాపేట్ వైపు వెళ్లే చిన్న వాహనాలు, చంచల్గూడ నుంచి వచ్చే వారు.. సైదాబాద్ వై-జంక్షన్ – 105 బస్ స్టాప్ వద్ద కుడి మలుపు తిరిగి రామాలయం కమాన్ – వినయ్ నగర్– భారత్ గార్డెన్ మీదుగా చంపాపేట్ మెయిన్ రోడ్డుకు వెళ్లాల్సి ఉంటుంది.
చాదర్ఘాట్ నుంచి చంపాపేట్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు నల్గొండ ఎక్స్ రోడ్ – మూసారాంబాగ్ – గడ్డి అన్నారం యు-టర్న్ – శివగంగా థియేటర్ – హనీఫియా మసీదు (సరూర్నగర్ చెరువు) – సింగరేణి కాలనీ – చంపాపేట్ మెయిన్ రోడ్ లో వెళ్లాలి.
భారీ వాహనాలు, ఎంజీబీఎస్/చాదర్ఘాట్ నుండి వచ్చే జిల్లా బస్సులు నల్గొండ ఎక్స్ రోడ్ వద్ద డైవర్ట్ అవుతాయి. ఇవి మూసారాంబాగ్, దిల్సుఖ్నగర్, కోఠాపేట్ , ఎల్బీ నగర్ చౌరస్తా మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది.
