హాస్టల్ స్టూడెంట్స్పై డ్రోన్ కెమెరాలతో నిఘా..అర్ధరాత్రిళ్లు బయట తిరిగితే డ్రగ్స్ టెస్టులు చేస్తం..మల్కాజిగిరి సీపీ సుమతి వార్నింగ్

హాస్టల్ స్టూడెంట్స్పై డ్రోన్ కెమెరాలతో నిఘా..అర్ధరాత్రిళ్లు బయట తిరిగితే డ్రగ్స్ టెస్టులు చేస్తం..మల్కాజిగిరి సీపీ సుమతి వార్నింగ్

 

  • సీసీ కెమెరాల్లో కూడా చూస్తం 
  • హాస్టల్​ ఓనర్లు స్పందించకపోతే మూసేస్తం 
  • మల్కాజిగిరి సీపీ సుమతి వార్నింగ్ 

మలక్​పేట, వెలుగు: మల్కాజిగిరి కమిషనరేట్​పరిధిలో ఇక నుంచి హాస్టల్స్​లో ఉంటున్న స్టూడెంట్స్​పై డ్రోన్​కెమెరాలతో నిఘా పెడతామని, అర్ధరాత్రిళ్లు ఎటు వెళ్తున్నారన్నది గమనిస్తామని, మిడ్​నైట్​లో బయట కనిపిస్తే పెట్రోలింగ్ పోలీసులతో డ్రగ్స్​టెస్టులు చేయిస్తామని సీపీ సుమతి హెచ్చరించారు. గురువారం రాత్రి దిల్​సుఖ్​నగర్​లో హాస్టల్​ఓనర్లతో కో ఆర్డినేషన్​మీటింగ్​నిర్వహించారు. 

ఈ సమావేశంలో పాల్గొన్న సీపీ సుమతి మాట్లాడుతూ.. కమిషనరేట్​పరిధిలో ఎన్నోచోట్ల హాస్టల్స్​ఉన్నా ఇదే ప్రాంతాన్ని ఎంచుకోవడానికి ఒక కారణం ఉందన్నారు. ఇక్కడికి ఎన్నో ప్రాంతాల నుంచి స్టూడెంట్స్​వస్తారని, ఈ ఏరియా కేంద్రంగా ఉంటారు కాబట్టే  ఎక్కువ ఫోకస్​చేయాల్సి వస్తుందన్నారు. చాలామంది దిల్​సుఖ్​నగర్​, సరూర్​నగర్​, చుట్టుపక్కల హాస్టల్స్​లో ఉంటారని, అందులో అదుపు తప్పేవారిని కంట్రోల్​చేయాల్సిన అవసరం వచ్చిందన్నారు. ఈ ప్రాంతంలో 3,200 కు పైగా కెమెరాలు ఉన్నాయని, వీటితో తమ నిఘా ఎప్పుడూ కొనసాగుతుందన్నారు. వీటితో పాటు డ్రోన్​పోలీసింగ్​కూడా ఉంటుందని చెప్పారు.

 పిల్లలు చెడు వ్యసనాలకు లోనైతే వారి తల్లిదండ్రులకు చెప్పేలా హాస్టల్ నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకోవాన్నారు. హాస్టల్స్​లో తప్పుడు పనులు జరిగితే ఓనర్స్​యాక్షన్​తీసుకోవాలని, లేకపోతే తాము మూసెయ్యాల్సి వస్తుందన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను కంట్రోల్​లో పెట్టాలన్నారు. యూత్​చెడు డ్రగ్స్​వంటి వాటికి దూరంగా ఉండాలని, వాళ్లు మారకపోతే ఆ పని తాము చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎల్బీ నగర్ డీసీపీ అనురాధ, అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు, ఏసీపీ కృష్ణయ్య, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డీఎఫ్ఓ సీనయ్య, ఎంఎంసీ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ హాజరయ్యారు.