హైదరాబాద్, వెలుగు: చేవెళ్ల బీఆర్ఎస్ఎంపీ రంజిత్రెడ్డిపై మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన కామెంట్లు చేశారు. అసెంబ్లీ లాబీలో శుక్రవారం ఆయన మీడియాతో చిట్చాట్చేస్తూ.. కాంగ్రెస్పార్టీ నుంచి చేవెళ్ల ఎంపీ టికెట్కోసం రంజిత్రెడ్డి కర్చీఫ్వేసుకున్నారని అన్నారు. అది తెలిసే పట్నం మహేందర్రెడ్డి అలర్ట్అయ్యారని, ఆ టికెట్కోసమే సీఎం రేవంత్రెడ్డిని మహేందర్రెడ్డి, ఆయన భార్య కలిశారని చెప్పారు.
కేసీఆర్కుటుంబంలో మూడు పదవులు ఉన్నట్టుగానే తన కుటుంబంలోనూ మూడు పదవులు ఉండాలని భావిస్తున్నానని మల్లారెడ్డి అన్నారు. తన కుమారుడు భద్రారెడ్డి మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని, కేసీఆర్ఆదేశిస్తే పోటీ చేస్తాడని తెలిపారు. మెదక్ఎంపీ టికెట్కోసమే జగ్గారెడ్డి సీఎం రేవంత్రెడ్డిని పొగుడుతున్నాడని, ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్కావడానికే తన పేరు ఎత్తుతుండని చెప్పారు. తన పేరు చెప్పకపోతే ఆయనను ఎవరూ పట్టించుకోరని అన్నారు.