మెగా అభిమానం చాటుకున్న మల్లారెడ్డి విద్యార్థులు

మెగా అభిమానం చాటుకున్న మల్లారెడ్డి విద్యార్థులు

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు ఆయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఓ ఈవెంట్ లో పాల్గొనేందుకు మల్లారెడ్డి కాలేజీకి వెళ్లిన చిరంజీవికి.. విద్యార్థులు మర్చిపోలేని జ్ఞాపకాన్ని అందించారు. మల్లారెడ్డి కాలేజీకి చెందిన 6000 మంది విద్యార్థులు కాలేజీ గ్రౌండ్ లో.. కూర్చుని వాల్తేరు వీరయ్య గెటప్ లోని చిరంజీవి రూపాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. తమ కాలేజీకి వచ్చిన చిరంజీవికి గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు.  విద్యార్థులు తన పట్ల చూపించిన ప్రేమకు చిరంజీవి ఆనందంతో పరశించిపోయారు. వారు చూపించిన ప్రేమకు వాల్తేరు వీరయ్య మూవీ డైరెక్టర్ బాబీ.. విద్యార్థులు, కాలేజీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. 

ప్రస్తుతం యంగ్ హీరోలకు పోటీగా రీఎంట్రీలోను చిరంజీవి అదరగొడుతున్నారు. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల గాడ్ ఫాదర్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న మెగాస్టార్.. ఇప్పుడు భోళా శంకర్, వాల్తేరు వీరయ్య చిత్రీకరణలలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన వాల్తేరు వీరయ్య టైటిల్‏కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. ఇందులో మాస్ మాహరాజా రవితేజ కీలకపాత్రలో కనిపించనున్నారు.