కాలేజీల ఓనరు.. మంత్రి మల్లారెడ్డి

కాలేజీల ఓనరు.. మంత్రి మల్లారెడ్డి

చామకూర మల్లారెడ్డి 1954 మార్చి 20న జన్మించారు. తల్లిదండ్రులు మల్లారెడ్డి, చంద్రమ్మ. డిగ్రీ డిస్ కంటిన్యూ చేసిన మల్లారెడ్డి.. బిజినెస్ లో మాత్రం రాణించారు. మల్లారెడ్డి విద్యాసంస్థలు స్థాపించారు. 2014లో మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి.. ఆ తర్వాత కేసీఆర్ పథకాలకు ఆకర్షితులై.. 2016లో టీఆర్ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పార్టీలో చురుగ్గా పాల్గొంటున్న మల్లారెడ్డికి మంత్రి పదవి చేపట్టే అవకాశాన్ని కల్పించారు ముఖ్యమంత్రి కేసీఆర్.