మాల్యా ఎదురుచూపులు..ఆస్తుల జప్తు విచారణ వాయిదా

మాల్యా ఎదురుచూపులు..ఆస్తుల జప్తు విచారణ వాయిదా

పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు, కింగ్ ఫిషర్ సంస్థల అధిపతి విజయ్ మాల్యా తన ఆస్తులను చట్టపరంగా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తనకు, తన కుటుంబసభ్యులకు సంబంధించిన సొంత ఆస్తులు, భవనాలు, కంపెనీలను .. దర్యాప్తు సంస్థలు జప్తు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మాల్యా సుప్రీంకోర్టులో ఇటీవల సవాల్ చేశారు. ఈ పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టు ముందుకొచ్చింది. విజయ్ మాల్యా పిటిషన్ పై విచారణను ఆగస్ట్ 13 కు వాయిదావేసింది సుప్రీంకోర్టు. దీంతో… మాల్యాకు  ఎదురుచూపులు తప్పలేదు.