అగౌరవపర్చే ఉద్దేశం లేదు: మమతా బెనర్జీ

అగౌరవపర్చే ఉద్దేశం లేదు: మమతా బెనర్జీ

న్యూఢిల్లీ: రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ను అనుకరిస్తూ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ కల్యాణ్ బెనర్జీ మిమిక్రీ చేయడంపై వివాదం చెలరేగడంతో పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ స్పందించారు. బుధవారం పార్లమెంటు కాంప్లెక్స్ లో విలేకర్లతో ఆమె మాట్లాడారు. తమకు ఎవరిని అగౌరవపరిచే ఉద్దేశం లేదని తెలిపారు. తాము ప్రతి ఒక్కరిని గౌరవిస్తామని చెప్పారు.

 ఈ అంశాన్ని  రాజకీయపరమైన కోణంలో సాధారణంగా చూడాలని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ వీడియో రికార్డింగ్ చేయకుంటే ఈ విషయం గురించి ఎవరికి తెలిసేది కాదని వెల్లడించారు. అంతకు ముందు పెండింగ్ నిధుల అంశంపై ప్రధాని మోదీని కలవడానికి తమ పార్టీ ఎంపీల బృందంతో కలిసి దీదీ పార్లమెంటు కాంప్లెక్స్​కు వచ్చారు.