తెలుగులో రిలీజ్కు సిద్ధమైన మమ్ముట్టి భ్రమయుగం

తెలుగులో రిలీజ్కు సిద్ధమైన మమ్ముట్టి భ్రమయుగం

మమ్ముట్టి ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం 'భ్రమయుగం’. రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో  నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వై నాట్ స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మించాయి. హారర్‌‌‌‌‌‌‌‌ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 15న తమిళంలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

తాజాగా తెలుగులో ఈ సినిమాను సితార ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్ సంస్థ ఫిబ్రవరి 23న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించింది. కంప్లీట్ బ్లాక్ అండ్ వైట్‌‌‌‌లో రూపొందిన ఈచిత్రం తెలుగు ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌‌‌‌పీరియెన్స్‌‌‌‌ను ఇస్తుందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పారు. అర్జున్ అశోకన్, సిద్దార్థ్‌‌‌‌‌‌‌‌, భరతన్, అమల్దా లిజ్‌‌‌‌‌‌‌‌ ఇతర పాత్రలు పోషించారు.