సెకండ్ బజార్‌లో బైక్‌ల నుండి పెట్రోల్ చోరీ, వ్యక్తి అరెస్టు

సెకండ్ బజార్‌లో బైక్‌ల నుండి పెట్రోల్ చోరీ, వ్యక్తి అరెస్టు

సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ సెకండ్ బజార్ లో బైక్ ల నుండి పెట్రోల్ చోరీ జరిగింది. రాత్రి నాలుగైదు బైక్ ల నుండి పెట్రోల్ దొంగతనం జరిగినట్టు తెలుస్తోంది. పైపులు విరగొట్టి గుర్తు తెలియని వ్యక్తి పెట్రోల్ ఎత్తుకెళ్లినట్టు సమాచారం. పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో పెట్రోల్ చోరీకి సంబంధించిన విజువల్స్ రికార్డయ్యాయి. ఈ విషయంపై బాధితులు మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పెట్రోల్ చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డవడంతో వ్యక్తి ఆనవాళ్లను స్థానికులు గుర్తించారు. పొంతనలేని సమాదానాలు చెబుతూ పారిపోతుండగా, పట్టుకొని పోలీసులకు అప్పగించారు. దాంతో పాటు బస్తీ పక్కనే కాళీగా ఉన్న బిల్డింగ్ ముందు భాగంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.