పాకిస్థాన్కు గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో బిహార్కు చెందిన ఓ వ్యక్తిని కోల్కతాలో పోలీసులు అరెస్టు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్కతాలోని కొరియర్ సర్వీస్ కంపెనీలో పనిచేస్తున్న నిందితుడిని హౌరాలోని అతని నివాసంలో అరెస్ట్ చేశారు.
అతని నుంచి దాయాది దేశానికి పంపిన ఫొటోలు, వీడియోలు, ఆన్లైన్ చాట్లతో సహా పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడ్డాడనే ఆరోపణలతో దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.
దేశ భద్రతకు విఘాతం కలిగించే కార్యకలాపాలలో నిందితుడు పాల్గొన్నట్లు గుర్తించినట్లు సీనియర్అధికారి ఒకరు తెలిపారు. అతని ఫోన్ద్వారా కీలక విషయాలు లభించాయని వివరించారు. ఆగస్టు 26న కోర్టులో హాజరుపరిచారు. గూఢచర్మం ఆరోపణల క్రమంలో కోల్కతాకు వచ్చే కొత్త వ్యక్తులను పోలీసులు తనిఖీ చేస్తున్నారు.