
హైదరాబాద్ : సిటీలో రెండు రోజుల్లోనే మూడు హత్యలు జరిగాయి. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి వేంకటేశ్వర నగర్ లో దారుణం చోటుచేసుకుంది. శుక్రవారం అర్థరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న అనిల్(40) అనే వ్యక్తిని కత్తులతో నరికి హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మృతుడు మెదక్ జిల్లా ముప్ఫారం గ్రామానికి చెందిన అనిల్ అని తెలిపారు పోలీసులు. అనిల్ కు 6 అంబులెన్స్ లు ఉన్నట్లు, శుక్రవారం ఉదయం నుండి ఇంట్లో గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అక్రమ సంబంధమే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మలక్ పేట్ మెట్రో స్టేషన్ దగ్గర కూడా ఈరోజు ఉదయం మరో హత్య వెలుగు చూసింది.