హైదరాబాద్ లో అర్థరాత్రి దారుణం.. ఆటోలో ముక్కలు ముక్కలుగా శరీర భాగాలు

హైదరాబాద్ లో అర్థరాత్రి దారుణం.. ఆటోలో ముక్కలు ముక్కలుగా శరీర భాగాలు

మెహిదీపట్నం, వెలుగు: ఓ వ్యక్తిని చంపి, ముక్కలు ముక్కలుగా చేసి, గోనె సంచిలో తీసుకొచ్చి దర్గా దగ్గర పడేసిన ఘటన లంగర్ హౌస్ పీఎస్​ పరిధిలో జరిగింది. సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. గురువారం రాత్రి 10:30 గంటల తర్వాత దర్గా మిలట్రీ హాస్పిటల్​సమీపంలో ఓ ఆటో ఆగింది. అందులో నుంచి ఓ వ్యక్తి, ఓ మహిళ దిగారు. గోనె సంచి తెచ్చి పడేస్తుండగా, స్థానికులు గమనించి ఏమిటి అని అడిగారు.

సమాధానం చెప్పకుండా ఇద్దరూ ఆటోలో అక్కడి నుంచి జారుకున్నారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి చూడగా గోనె సంచిలో డెడ్​బాడీ ఉన్నట్లు గుర్తించారు. ముక్కలు, ముక్కలుగా నరికి పాలిథిన్ కవర్​లో శరీర భాగాలను మూటగట్టినట్లు తెలిసింది.

వెంటనే వాటిని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని, డెడ్​బాడీ ఎవరిదో, తెచ్చి పడేసింది ఎవరో అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.