
సంగారెడ్డి జిల్లా: అమీన్ పూర్ మండలంలోని సుల్తాన్ పూర్ గుట్టల్లో ఓ వ్యక్తిని హత్య చేశారు. స్పాట్ కు చేరుకున్న పోలీసులు… మృతుడ్ని చత్తీస్ ఘడ్ కు చెందిన అనిల్ కుమార్ గా గుర్తించారు. ఎవరు హత్య చేసి ఉంటారనే దానిపై విచారణ జరుపుతున్నారు పోలీసులు. అనిల్ ను ఇక్కడే హత్య చేశారా.. వేరే దగ్గర చంపి ఇక్కడ పడేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.