
- 80 శాతం కాలిన గాయాలతో జీజీహెచ్లో మరొకరు
- పేకాట గొడవే కారణమని అనుమానం
నిజామాబాద్, వెలుగు : కూలిపోయే స్థితిలో ఉన్న ఇంట్లో సజీవ దహనమైన వ్యక్తి శవం కనిపించడం, మరొకరు జీజీహెచ్ హాస్పిటల్లో 80 శాతం కాలిన గాయాలతో ట్రీట్మెంట్కోసం చేరడం నిజామాబాద్లో కలకలం రేపింది. గంజాయి మత్తులో కదల్లేని స్థితిలో ఉన్న నలుగురి మధ్య జరిగిన గొడవే కారణమని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వ్యక్తి ద్వారా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అతను చెప్పిన పేర్లతో వివరాలు సేకరించడానికి అడిషనల్ డీసీపీ జయరాం ప్రయత్నిస్తున్నారు. ఖిల్లా ఏరియాలోని సెయింట్ మేరీ స్కూల్ వెనుక భాగంలో పాడుబడ్డ ఇల్లు ఉంది.
ఆదివారం రాత్రి ఇస్మాయిల్, ముఖిద్, మన్సూర్, అహ్మద్ పేకాట కోసం ఆ ఇంట్లోకి వెళ్లారు. క్యాండిల్, ఫ్లెక్సీ వెంట తీసుకువెళ్లారు. గంజాయి మత్తు లో తూలుతూ పేకాడుతుండగా గొడవ జరిగిందని ముఖిద్తనను మంటలోకి తోసేశాడని జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న అహ్మద్చెబుతున్నాడు. సోమవారం పొద్దున కాలిన గాయాలతో ఇంటికి చేరిన అహ్మద్ను కుటుంబీకులు దవాఖానాలో చేర్పించారు.
సజీవ దహనమై ఉన్న డెడ్బాడీ ఎవరిదనే తేల లేదు. మరో ఇద్దరు పరారైనట్లు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఏసీపీ కిరణ్కుమార్, సీఐ నరహరి విజిట్ చేశారు. క్లూస్టీంను రప్పించారు. ట్రీట్మెంట్ పొందుతున్న అహ్మద్ను అడిషనల్ డీసీపీ జయరాం, ట్రైనీ ఐపీఎస్లావణ్య చూశారు. ప్రస్తుతానికి అతడు చెబుతున్న విషయాలనే ప్రాథమిక సమాచారంగా పరిగణిస్తున్నామని అడిషనల్డీసీపీ జయరాం మీడియాకు తెలిపారు.