పాడుబడ్డ ఇంట్లో వ్యక్తి సజీవదహనం

పాడుబడ్డ ఇంట్లో వ్యక్తి సజీవదహనం
  •  80 శాతం కాలిన గాయాలతో జీజీహెచ్​లో మరొకరు
  • పేకాట గొడవే కారణమని అనుమానం

నిజామాబాద్, వెలుగు : కూలిపోయే స్థితిలో ఉన్న ఇంట్లో సజీవ దహనమైన వ్యక్తి శవం కనిపించడం, మరొకరు జీజీహెచ్ ​హాస్పిటల్​లో 80 శాతం కాలిన గాయాలతో ట్రీట్​మెంట్​కోసం చేరడం నిజామాబాద్​లో కలకలం రేపింది. గంజాయి మత్తులో కదల్లేని స్థితిలో ఉన్న నలుగురి మధ్య జరిగిన గొడవే కారణమని హాస్పిటల్​లో చికిత్స పొందుతున్న వ్యక్తి ద్వారా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అతను చెప్పిన పేర్లతో వివరాలు సేకరించడానికి అడిషనల్ ​డీసీపీ జయరాం ప్రయత్నిస్తున్నారు. ఖిల్లా ఏరియాలోని సెయింట్​ మేరీ స్కూల్​ వెనుక భాగంలో పాడుబడ్డ ఇల్లు ఉంది.

ఆదివారం రాత్రి ఇస్మాయిల్, ముఖిద్, మన్సూర్, అహ్మద్ ​పేకాట కోసం ఆ ఇంట్లోకి వెళ్లారు. క్యాండిల్, ఫ్లెక్సీ వెంట తీసుకువెళ్లారు. గంజాయి మత్తు లో తూలుతూ పేకాడుతుండగా గొడవ జరిగిందని ముఖిద్​తనను మంటలోకి తోసేశాడని జీజీహెచ్ ​లో చికిత్స పొందుతున్న అహ్మద్​చెబుతున్నాడు. సోమవారం పొద్దున కాలిన గాయాలతో ఇంటికి చేరిన అహ్మద్​ను కుటుంబీకులు దవాఖానాలో చేర్పించారు.

సజీవ దహనమై ఉన్న డెడ్​బాడీ ఎవరిదనే తేల లేదు. మరో ఇద్దరు పరారైనట్లు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఏసీపీ కిరణ్​కుమార్, సీఐ నరహరి విజిట్ చేశారు. క్లూస్​టీంను రప్పించారు. ట్రీట్​మెంట్ ​పొందుతున్న అహ్మద్​ను అడిషనల్ ​డీసీపీ జయరాం, ట్రైనీ ఐపీఎస్​లావణ్య చూశారు. ప్రస్తుతానికి అతడు చెబుతున్న విషయాలనే ప్రాథమిక సమాచారంగా పరిగణిస్తున్నామని అడిషనల్​డీసీపీ జయరాం మీడియాకు తెలిపారు.