గచ్చిబౌలి, వెలుగు: సోషల్ మీడియాలో అమ్మాయిల పేర్లతో ఫేక్ప్రొఫైల్ క్రియేట్చేసి యువకులను మోసం చేసిన వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వైజాగ్కు చెందిన శశాంక్రెడ్డి(24) సిటీలో ఉంటూ జూనియర్ఆర్టిస్ట్గా పనిచేస్తున్నాడు. వైజాగ్కు చెందిన సోషల్ ఇన్ఫ్ల్యూయెన్సర్మేఘనా రఘుపాత్రుని పేరుతో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో ఫేక్ ప్రొఫైల్తో పలువురికి రిక్వెస్ట్లు పంపాడు.
గచ్చిబౌలిలో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న యువకుడి(32)కి మేఘనా రఘుపాత్రుని పేరుతో రిక్వెస్ట్రావడంతో యాక్సెప్ట్ చేశాడు. అతనితో శశాంక్రెడ్డి అమ్మాయిలా చాటింగ్చేయడం మొదలుపెట్టాడు. కొద్ది రోజులకు తన తల్లి చనిపోయిందని, హాస్పిటల్లో ఉన్నానని రెంట్, ఈఎంఐ కట్టాలని డబ్బు వసూలు చేశాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగ్గా పలు కారణాలు చెబుతూ దాటవేస్తుండటంతో మోసపోయినట్లు బాధితుడు గుర్తించాడు. పోలీసులు శశాంక్రెడ్డిని పట్టుకున్నారు. ఇలా రూ.80 లక్షలు మోసం చేసినట్లు గుర్తించారు.