మహారాష్ట్రలో దసరా వేడుకల్లో విషాదం

మహారాష్ట్రలో దసరా వేడుకల్లో విషాదం

మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. దసరా వేడుకల్లో భాగంగా గర్భా డాన్స్ చేస్తూ ఓ వ్యక్తి కన్నుమూశాడు. కొడుకు మరణించాడని తెలిసి షాక్కు గురైన అతని తండ్రి ప్రాణాలు వదిలాడు. 

పాల్ఘర్కు చెందిన మనీష్ ఆదివారం రాత్రి విరార్లోని గ్లోబల్ సిటీ కాంప్లెక్స్ లో నిర్వహించిన గర్భా కార్యక్రమానికి హాజరయ్యాడు. అందరితో కలిసి డాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు అతన్ని దగ్గరలోని హాస్పిటల్కు తరలించారు. అయితే అప్పటికే మనీష్ చనిపోవడంతో డాక్టర్లు ఆ విషయాన్ని అతని తండ్రి చెప్పారు. డాక్టర్లు చెప్పిన మాట వినగానే మృతి తండ్రి షాక్ కు గురై కుప్పకూలాడు. స్పాట్ లోనే ప్రాణాలు వదిలాడు. నిమిషాల వ్యవధిలోనే తండ్రీ కొడుకులు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.