లోన్ యాప్ వేధింపులను తట్టుకోలేక..

 లోన్ యాప్ వేధింపులను తట్టుకోలేక..

హైదరాబాద్లో లోన్ యాప్ ఆగడాలు ఆగడం లేదు. తాజాగా మరో వ్యక్తి లోన్ యాప్ వేధింపులతో చనిపోయాడు.  రాజేంద్రనగర్ శాస్త్రీపురంలో రైలు కింద పడి ఫైర్ మెన్ సుధాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. గోల్డెన్ రూపీ యాప్ ద్వారా సుధాకర్ 6 వేలు లోన్ తీసుకున్నాడు. అయితే తీసుకున్న లోన్ కట్టకపోవడంతో యాప్ ఏజెంట్లు వేధింపులకు గురిచేశారు. సుధాకర్ బంధువులకు అసభ్యకరమైన మెసేజ్లు పెట్టారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుధాకర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లోన్ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు.