డ్యామ్ ఎక్కబోయి జారిపడ్డ యువకుడు

డ్యామ్ ఎక్కబోయి జారిపడ్డ యువకుడు

కర్ణాటకలోని చిక్కబల్లాపూర్‌లోని శ్రీనివాస సాగర డ్యామ్‌ను ఎక్కేందుకు ప్రయత్నించి ఓ వ్యక్తి ఆస్పత్రి పాలయ్యాడు. 50 అడుగుల ఎత్తు గల ఈ ఆనకట్టపైకి దాదాపు 25 అడుగుల ఎత్తుకు చేరుకున్న అతను..ఒక్కసారిగా పట్టుతప్పి జారిపడి నేలపై పడ్డాడు. స్వల్పగాయాలైన అతన్ని.. అక్కడున్న వారు ఆస్పత్రిలో చేర్చారు. ప్రమాదకర ఫీట్ చేయవద్దని అధికారులు హెచ్చరించినా పట్టించుకోకుండా గోడ ఎక్కిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో ఈ వ్యక్తి చికిత్స పొందుతున్నట్టు సమాచారం.

 

మరిన్ని వార్తల కోసం...

ముంబై బాలిక... ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ అధిరోహణ

డాక్టర్ ను సస్పెండ్ చేసిన మంత్రి హరీష్ రావు