హనుమకొండ జిల్లాలో పోలీస్ నియామకాల ప్రక్రియ జరుగుతోంది. ఇందులో భాగంగా కేయూ యునివర్సిటీ మైదానంలో నిర్వహిస్తున్న దేహధారుడ్య పరీక్షల్లో ఓ అభ్యర్థి తీవ్ర అస్వస్థతకు గురైయ్యాడు. వెంటనే అతడిని వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కు తరలించారు. ఈవెంట్స్ జరుగుతుండగా 1600 మీటర్ల పరుగు అనంతరం రాజేందర్ అనే అభ్యర్థి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు.
రాజేందర్ స్వస్థలం ములుగు జిల్లాలోని పందికుండ సమీపంలో శివతండా. ఎంజీఎం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రాజేందర్ ను వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ పరామర్శించారు. తన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాజేందర్ కు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.