కరోనా సోకిందన్న భయంతో ఆత్మహత్య..!

కరోనా సోకిందన్న భయంతో ఆత్మహత్య..!

కరోనా వైరస్ సోకిందన్న భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాసిక్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నాసిక్ లోని చెదెడి ఏరియాలో నివసిస్తున్న ప్రతీక్ రాజు కుమావత్ శనివారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు సూసైడ్ నోట్ లభించింది. అందులో… తనకు కరోనా సోకిందని అందుకే ఆత్మహత్య చేసుంటున్నానని రాశాడు.

ప్లంబింగ్ పని చేసే రాజు.. గత కొన్ని రోజులుగా గొంతునొప్పితో బాధపడుతున్నడని తెలిపారు స్థానికులు. దగ్గరలోని హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నాడని చెప్పారు. అయితే అతను తన గొంతు నొప్పిని కరోనా వ్యాధిలక్షణాలలో ఒకటని అనుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.