భోపాల్లో విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. క్రికెట్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచిన వ్యక్తికి బహుమతిగా 5 లీటర్ల పెట్రోల్ అందించారు. భోపాల్లో కాంగ్రెస్ నాయకుడు మనోజ్ శుక్లా ఒక క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించారు. ఈ టోర్నమెంట్కు సంబంధించిన ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరిగింది. ఈ మ్యాచ్లో ప్రతిభ కనబరిచిన సలావుద్దీన్ అబ్బాసి అనే క్రికెటర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. ఆయనకు బహుమతిగా 5 లీటర్ల పెట్రోల్ క్యాన్ను మనోజ్ శుక్లా అందించాడు. దాంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇదేవిధంగా కొన్ని రోజుల క్రితం కరూర్ జిల్లాలో తిరువల్లూవర్ దినోత్సవం సందర్భంగా జనవరి 16న ఒక ఆఫర్ను ప్రవేశపెట్టారు. ఆ ఆఫర్ అందరినీ ఆకర్షించింది. ఎవరైతే ‘తిరుక్కురల్’ వేదాలను తప్పులు లేకుండా పఠిస్తే వారికి ఒక లీటర్ పెట్రోల్ ఉచితంగా అందించారు.
దేశంలో గత కొన్ని రోజుల నుంచి పెట్రోల్, డీజీల్ ధరలు ప్రతిరోజూ పెరుగుతున్నాయి. దాంతో సామాన్యుడు బండి బయటకు తీయాలంటేనే వణుకుతున్నాడు. కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధర సెంచరీ కొట్టింది. అయినా కూడా పెట్రోల్ ధరల పెంపు మాత్రం ఆగడం లేదు. వీటికి తోడుగా గ్యాస్ ధరలు కూడా పెరగడంతో బతుకుబండిని లాగడం సామాన్యునికి కష్టంగా మారింది.