వీడియోకు ఫోజులిచ్చాడు.. జారి గల్లంతయ్యాడు

వీడియోకు ఫోజులిచ్చాడు.. జారి గల్లంతయ్యాడు

సోషల్​ మీడియా సరదాలు ప్రాణాలు తీస్తున్నాయి. మొన్నటికి మొన్న ఓ జంట సముద్రం ఒడ్డున ఫొటోలు దిగుతుంటే.. ఓ రాకాసి అల అమాంతం మహిళను సంద్రంలోకి లాక్కెళ్లింది. అలా ప్రకృతి ప్రకోపానికి ఎదురెళ్లి ఎందరో బలైపోతున్నారు. ఇలాంటి ఘటనే జులై 24న కర్ణాటకలో జరిగింది.శివమొగ్గ జిల్లా భద్రావతికి చెందిన 23 ఏళ్ల యువకుడు అరసినగుండి వాటర్​ఫాల్స్ ని చూసేందుకు ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లాడు. 

జలపాతం అంచున బండరాయిపై నిలబడి వీడియోలకు ఫోజులిచ్చాడు. అంతలో కాలు జారి నీళ్లలో పడిపోయాడు. ఆ తరువాత అమాంతం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అతని ఫ్రెండ్స్ పోలీసులకు సమాచారం అందించడంతో గజ ఈతగాళ్ల సాయంతో యువకుడి కోసం గాలిస్తున్నారు. 

ప్రమాదానికి సంబంధించిన వీడియో బాధితుడి ఫ్రెండ్​ ఫోన్లో రికార్డ్​ అయ్యాయి. ఇది ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్ గా మారింది. నీటి వనరుల ప్రాంతాలకు టూరిస్టులు వెళ్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.