తమ్ముడి భార్యపై పెట్రోల్‌‌ పోసి నిప్పు పెట్టిండు

తమ్ముడి భార్యపై పెట్రోల్‌‌ పోసి నిప్పు పెట్టిండు

భోపాల్‌‌: తమ్ముడి భార్యపై పెట్రోల్‌‌ పోసి, నిప్పంటించి చంపాడో వ్యక్తి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌‌లోని రత్లామ్ జిల్లాలో జరిగింది. నిర్మలా, ప్రకాశ్‌‌ భార్యభర్తలు. కొన్ని కారణాల వల్ల నిర్మలా భర్త ఆరు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, తన తమ్ముడి చావుకు అతని భార్య నిర్మల కారణామని ప్రకాశ్‌‌ అన్న సురేశ్‌‌ రగిలిపోయేవాడు. ఈ విషయంపై ఇంట్లో ప్రతి రోజూ గొడవలు జరిగేవి. భర్త చనిపోయిన తర్వాత నిర్మల తన ఇద్దరు పిల్లలతో కలిసి అత్తగారింట్లోనే ఉండేది. 

ఈ క్రమంలో శనివారం కూడా ఈ విషయంపై ఇంట్లో గొడవ జరగగా, నిర్మలపై దాడి చేసి, ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చిన సురేశ్‌‌ ఆమెపై పెట్రోల్‌‌ పోసి, నిప్పంటించాడు. దీంతో నిర్మల అక్కడికక్కడే మృతి చెందిందని పోలీసులు తెలిపారు. నిర్మల బ్రదర్‌‌‌‌ మీడియాతో మాట్లాడుతూ.. తన తమ్ముడి చావుకు నీ చెల్లె కారణమని సురేశ్‌‌ గత కొన్ని రోజులుగా తన సోదరిని వేధిస్తున్నాడని చెప్పాడు. ఆమెను చంపేస్తామని బెదిరించారని తెలిపాడు. దీంతో వెంటనే తన సోదరిని ఇంటికి తీసుకురావాలని నిర్ణయించుకున్నానని, ఇంతలో సురేశ్‌‌ తమకు ఫోన్‌‌ చేసి, ‘‘మీ చెల్లెలికి నిప్పంటించాం. నా తమ్ముడి చావుకు నీ చెల్లె కారణం”అని చెప్పాడన్నాడు. నిందితుడు సురేశ్‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.