దరిద్రం కాకపోతే ఏంటీ : రూ.80 బిర్యానీ కోసం ఆగాడు.. రూ.4 లక్షలు కొట్టేశారు.

దరిద్రం కాకపోతే ఏంటీ : రూ.80 బిర్యానీ కోసం ఆగాడు.. రూ.4 లక్షలు కొట్టేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్లు, షాపులు అనే తేడా లేకుండా.. ఎక్కడ పడితే అక్కడ దొంగతనాలు చేస్తున్నారు. భీమవరంలో ఓ దుండగుడు బైక్ డిక్కీలోని 4లక్షల రూపాయిలను చాకచక్యంగా దొంగిలించాడు.  అది ఏ మారుమూల ప్రాంతమో.. జపసంచారం లేని వీధిలోనో కాదు..  భీమవరంలో రద్దీగా ఉండే బిరియానీ షాపు ఎదుట ఈ చోరీ జరిగింది.  

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరం పట్టణంలో బుధవారం( జులై 26)  దొంగలు రెచ్చిపోయారు. బిర్యానీ తనడానికి వెళ్లిన వ్యక్తి బండిలోంచి డబ్బులు దోచుకున్నారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం… పట్టణంలోని సీతయ్య హోటల్ వద్ద స్కూటీ డిక్కీలో ఉన్న 4 లక్షల రూపాయలను దొంగలు ఎత్తుకు పోయారు.పట్టణానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి తన కుర్రాళ్లకు రూ.4 లక్షలు ఇచ్చి బ్యాంకులో వేయమని చెప్పగా బ్యాంక్ టైం అయిపోవడంతో రూ.80 బిర్యాని తినటానికి బైకు బయట ఆపి వెళ్లారు. ఇది గమనించిన దొంగలు బైకు డిక్కీలోని సొమ్ము అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిసిటీవి ఫుటేజీ ఆధారంగా విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.