కుక్కలను ఇలా చంపుతున్నారేంట్రా నాయనా..

కుక్కలను ఇలా చంపుతున్నారేంట్రా నాయనా..

జంతు హింస చేయరాదు..జంతువుల కాపాడాలి..పెంపుడు జంతువులైనా..వీధి కుక్కలైనా వాటిని హింసిస్తే చర్యలు తప్పవని ఓ పక్క ప్రభుత్వాలు, సొసైటీలు చెప్తుంటే.. మరో పక్క జంతువులను క్రూరంగా హింసిస్తున్న దారుణ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ లోని ఘాజీపూర్ లో ఓ కుక్కను అతిభయంకరంగా చంపిన సంఘటన కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ లలో ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ సంఘటన వీడియోలో ఓ వ్యక్తి తన బైక్ వీధికుక్కను కట్టివేసి కచ్చా రోడ్డుపై ఫుల్ స్పీడ్ తో ఈడ్చుకెళ్తుండగా.. మరో వ్యక్తి వెనకనుంచి వీడియో రికార్డు చేస్తున్నాడు. ఆ కుక్క చనిపోయిందా లేదా అనేది తెలియదు. ఈ వీడియో చూసిన నెటిజన్లంతా ఇంత దారుణమా అని ఆగ్రహిస్తున్నారు. 

ఇంత దారుణమైన ఘటనలు మొదటిసారి కాదు.. 2023 జూలై లో కూడా ఎంపీ జబల్ పూర్ లో కొంతమంది వ్యక్తులు కుక్కను కొట్టి చంపిన ఘటన సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ గ్రామ సర్పంచి, అతని అనుచరులు కలిసి కుక్కను మెట్లపై నుంచి కిందపడేసి పెద్ద కర్రలతో కొట్టి చంపారు. 

ఇలాంటి దృశ్యాలను జంతు సంరక్షణ సంఘాలకు తెలుసా.. లేక తెలిసి కూడా గుమ్మనంగా ఉంటున్నారా అని నెటిజన్లు  సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతైన మూగ జీవులను ఇలాంటి ప్రాణులను దారుణంగా చంపడం బాధకరమైన విషయమే.