పంజాగుట్ట ఫ్లైఓవర్ వద్ద మతిస్థిమితం లేని వ్యక్తి హల్ చల్

పంజాగుట్ట ఫ్లైఓవర్ వద్ద మతిస్థిమితం లేని వ్యక్తి హల్ చల్
పంజాగుట్ట ఫ్లైవ‌ర్ వద్ద మతిస్థిమితం లేని ఓ వ్యక్తి హ‌ల్ చ‌ల్ చేశాడు. పంజాగుట్ట చౌర‌స్తాలోని ట్రాఫిక్ పోలీస్ పైలాన్ ఎక్కి ఆత్మహ‌త్యా య‌త్నం చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జ‌హీరాబాద్ మండ‌లం న్యాల‌క‌ల్ కు చెందిన ర‌వి అనే వ్యక్తి కారు డ్రైవ‌ర్ గా పని చేస్తున్నాడు. గ‌త కొంత‌కాలంగా అత‌నికి మాన‌సిక ప‌రిస్థితి స‌రిగా లేదు. దీంతో కుటుంబ స‌భ్యులు ఆయ‌న్ను పంజాగుట్టలోని నిమ్స్‌ హాస్పిటల్‌లో చేర్పించేందుకు తీసుకెళుతుండగా వారి నుంచి తప్పించుకున్నాడు. అక్కడున్న ట్రాఫిక్ పైలాన్ పై ఎక్కి దూకేందుకు ప్రయత్నించాడు. అది గమనించిన పోలీసులు ఆర్టీసీ బస్సు సహాయంతో అతన్ని అడ్డుకొని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.