దసరాలోపు మంచిర్యాలలో ఇండస్ట్రియల్ పార్క్: ఎమ్మెల్యే ప్రేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు

దసరాలోపు మంచిర్యాలలో ఇండస్ట్రియల్ పార్క్: ఎమ్మెల్యే ప్రేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు

రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. చిన్నతరహా పరిశ్రమలు స్థాపించి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. దసరా పండుగలోపు మంచిర్యాలలో ఇండస్ట్రియల్ పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు శంకుస్థాపన చేస్తామని తెలిపారు. 

విద్య, వైద్య రంగాల్లో మంచిర్యాలను హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. మంచిర్యాల నియోజకవర్గంలో వంశీకి లక్ష మెజారిటీ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ చైర్ పర్సన్ సురేఖ, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంపత్ రెడ్డి, మంచిర్యాల, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, సురిమిళ్ల వేణు, టౌన్ ప్రెసిడెంట్ తూముల నరేశ్, నాయకులు చిట్ల సత్యనారాయణ, సిరిపురం రాజేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.