Plane Crash: ప్రమాదం రోజు ఎయిర్ ఇండియా విమానంలో లండన్ వెళ్లా.. నేను సేఫ్: మంచు లక్ష్మి

 Plane Crash: ప్రమాదం రోజు ఎయిర్ ఇండియా విమానంలో లండన్ వెళ్లా.. నేను సేఫ్: మంచు లక్ష్మి

అహ్మదాబాద్ విమానం కూలిన రోజు మంచు లక్ష్మి కూడా లండన్కు వెళ్లే ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లోనే ప్రయాణించారు. అయితే, అదృష్టవశాత్తూ ఆమె ముంబై నుంచి వెళ్లే ఫ్లైట్ ఎక్కడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషయాన్ని మంచు లక్ష్మి స్వయంగా ట్వీట్, వీడియో రిలీజ్ చేసి చెప్పుకొచ్చింది. 

'నేను ఎలా ఉన్నానో కనుక్కోవడం కోసం ఎన్నో ఫోన్లు, మెసేజ్లు వస్తున్నాయి. అహ్మదాబాద్లో విమాన ప్రమాదం జరిగిన రోజు నేను, మా అమ్మాయి ముంబై నుంచి లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో ప్రయాణించాం. దేవుడి దయవల్ల మేము సేఫ్ గా లండన్ చేరుకున్నాం. అక్కడ ల్యాండ్ అయిన వెంటనే ఈ ప్రమాదం గురించి తెలిసి ఉలిక్కిపడ్డాను. 

ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం నిజంగా బాధాకరం. ఈ ప్రమాదంలో విద్యార్థులు, డాక్టర్లు చనిపోయారని తెలిసి నా హృదయం ముక్కలైంది. జీవితంలో ఎప్పుడు ఏంజరుగుతుందో తెలియదు. మన ప్రాణాలు క్షణంలో ముగిసిపోతాయనడానికి ఈ 
ప్రమాదమే ఓ ఉదాహరణ. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను' అని