సమస్య వస్తే కూర్చొని మాట్లాడుకోవాలి.. మంచు మనోజ్ కామెంట్స్ ఎవరి గురించి?

సమస్య వస్తే కూర్చొని మాట్లాడుకోవాలి.. మంచు మనోజ్ కామెంట్స్ ఎవరి గురించి?

మంచు బ్రదర్స్ విష్ణు(Manchu Vishnu), మనోజ్‌(Manchu Manoj)ల మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులు క్రితం ఈ ఇద్దరి మధ్య గొడవ జరిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోపై తండ్రి మోహన్‌ బాబు కూడా స్పందించారు. దీంతో ఆ వివాదం అక్కడితో ముగిసిపోయింది. 

ఇదిలా ఉంటే.. తాజాగా మంచు మనోజ్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ మారాయి. ఆయన చేసిన కామెంట్స్ అన్న మంచు విష్ణు గురించేనా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రీసెంట్ గా మంచు మనోజ్ సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలో సోదరా అనే సినిమా చేస్తున్నారు. అన్నదమ్ముల సెంటిమెంట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. తాజాగా ఈ సినిమా నుండి సాంగ్‌ రిలీజ్‌ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కు మంచు మనోజ్‌ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ.. ఎవరి జీవితంలో అయినా అన్నదమ్ముల అనుబంధం అనేది చాలా  ప్రత్యేకం. కానీ ఎప్పుడైతే వారి మధ్య ఈగోలు వస్తాయో.. అప్పటినుండి వాళ్ల బంధం ముందుకు సాగదు. ఏదైనా ప్రాబ్లమ్స్‌ వస్తున్నాయంటే.. కూర్చుని మాట్లాడుకొని సరిచేసుకోవాలి. అలా జరిగితేనే ఏ ఫ్యామిలీ అయినా ఆనందంగా ఉంటుంది.. అని చెప్పుకొచ్చారు మంచు మనోజ్. అయితే మంచు మనోజ్ చేసిన ఈ కామెంట్స్ అన్న మంచు విష్ణు గురించే అని ఉంటారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మనస్పర్థాలతో ఉన్న ఈ ఇద్దరు అన్నదమ్ములు త్వరలో కలిసిపోయే అవకాశం ఉందని అంటున్నారు.