Manchu Vishnu: కన్నప్పకు అద్భుతమైన రెస్పాన్స్.. భగవంతుడికి, భక్తుడికి మధ్య ఎవరక్కర్లే

Manchu Vishnu: కన్నప్పకు అద్భుతమైన రెస్పాన్స్.. భగవంతుడికి, భక్తుడికి మధ్య ఎవరక్కర్లే

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందిన చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమా శుక్రవారం (JUNE27న) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

కన్నప్ప మూవీకి అంతటా పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. సినిమా చివరి 40 నిమిషాలు అయితే అద్భుతమని ఆడియన్స్ నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభాస్, విష్ణు, మోహన్ లాల్ తమ పాత్రలతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తారని అంటున్నారు. మంచు ఫ్యామిలీ నుంచి ఈ మధ్య కాలంలో ట్రోలింగ్ లేకుండా.. పాజిటివిటీ తెచ్చుకున్న మూవీగా కన్నప్ప నిలిచిందని అంటున్నారు.

గురువారం (జూన్26న) విష్ణు తన సినిమా పట్ల ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో విష్ణు మాట్లాడుతూ ‘‘ఈ మూవీ ప్రీ బుకింగ్స్‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటివరకు లక్షకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. ఇదంతా శివ లీల అనిపిస్తుంది.

‘కన్నప్ప’మీద ఇంత పాజిటివిటీ వస్తుందని ప్రారంభంలో ఎవ్వరూ నమ్మలేదు. అది వారి తప్పు కాదు. ఇప్పుడు ‘కన్నప్ప’ మీద ఫుల్ పాజిటివిటీ వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నాం. ఈ చిత్రాన్ని ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా చూడాలని కోరుకుంటున్నా. అందుకే టికెట్ రేట్లు పెంచడం లేదు. పిల్లలే ఎక్కువగా చూడాలని అనుకుంటున్నా. 

నా నలుగురు పిల్లలు ఈ చిత్రంలో నటించారు. ఓ తండ్రిగా నా పిల్లల్ని తెరపై చూడటం ఆనందంగా ఉంటుంది. ఇందులో నటించిన ప్రభాస్‌‌‌‌కి నేను ఎంతో రుణపడి ఉన్నాను. మోహన్‌‌‌‌లాల్ గారి పాత్ర సర్‌‌‌‌‌‌‌‌ప్రైజింగ్‌‌‌‌గా ఉంటుంది.  ఈ చిత్రంలో ఎవ్వరినీ ఎక్కడా కూడా అగౌరవపర్చలేదు.

భగవంతుడికి, భక్తుడికి మధ్యలో ఎవ్వరూ ఉండాల్సిన పని లేదు అని చెప్పడమే ఈ చిత్రం ఉద్దేశం. కన్నప్ప’కల్పితం కాదు. ఆయన మన చరిత్ర. మన మధ్యలో జీవించారు. ఇప్పటికీ ఆయన్ను ఆరాధిస్తుంటారు. ఆ దేవుడి దయవల్ల నేను ‘కన్నప్ప’విషయంలో ఎప్పుడూ ఆర్థిక కష్టాల్ని ఎదుర్కోలేదు. ఈ చిత్రం పది వారాల వరకు ఓటీటీలో రాదు’’అని చెప్పాడు.