
మంచు విష్ణు హీరోగా నటించిన ‘కన్నప్ప’ రిలీజ్కు సర్వం సిద్ధమైంది. రేపు శుక్రవారం (జూన్ 27న) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్తో మూవీ నిర్మించబడింది.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ల ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాధారణ టికెట్ రేటుకు అదనంగా సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ల్లో రూ.50 (జీఎస్టీ అదనం) పెంచుకునేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్లు రూ.206.50 వరకు, మల్టీప్లెక్స్లో రూ.236 వరకు పెంచింది.
సినిమా విడుదల తేదీ నుంచి 10 రోజుల పాటు ఈ ధరలు కొనసాగుతాయని జీవోలో ప్రభుత్వం వెల్లడించింది. ఆ తర్వాత రోజు నుండి మామూలు ధరలకే టికెట్లు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. మరోవైపు తెలంగాణలో మాత్రం టికెట్ ధరల విషయంలో ఎలాంటి మార్పు లేదు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ సైతం మొదలయ్యాయి.
#Kannappa : AP Tickets Hiked!
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) June 25, 2025
Single screens upto ₹206.50 and Plexes ₹236!! pic.twitter.com/liCUPmVdBf
‘మహాభారత’సిరీస్ని డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ కన్నప్ప సినిమాకి దర్శకత్వం వహించాడు. మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని కన్నప్ప చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. భక్తి, ప్రేమ, త్యాగం, విధితో నిండిన ఈ ప్రతిష్టాత్మకమైన మూవీకి విష్ణు స్క్రీన్ ప్లే, స్టోరీ అందించాడు.