
హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిన ‘కన్నప్ప’ విడుదలకు సిద్ధమైంది. మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని 'కన్నప్ప' చిత్రాన్ని రూపొందించారు. శుక్రవారం (జూన్ 27న) తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కన్నప్ప విడుదల కానుంది.
ఈ సందర్భంగా హీరో మంచు విష్ణు ఇవాళ (జూన్ 25న) శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి అమ్మవార్లకు విష్ణు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి అభిషేకం,అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. దర్శనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో పండితులు ఆశీర్వదించగా, అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Twelve Jyotirlingas. One journey. Eternal peace.
— Vishnu Manchu (@iVishnuManchu) June 25, 2025
Just completed the sacred darshan at Sri Sailam Mallikarjuna Swamy Temple — one of the twelve revered Jyotirlingas of Lord Shiva.
With this visit, my journey to all twelve Jyotirlinga temples comes to a divine close.
My heart is… pic.twitter.com/COYa872JrG
అనంతరం విష్ణు మాట్లాడుతూ..' శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడంతో 12 జ్యోతిర్లింగాలు యాత్ర పూర్తి చేసుకున్నట్లు చెప్పారు. ఈనెల 27వ తేదీన సినిమా రిలీజ్ సందర్భంగా.. ప్రేక్షకులందరూ కన్నప్ప సినిమాను చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నట్లు విష్ణు తెలిపారు.