మహిళా కాంగ్రెస్​ మీటింగ్​కు అటెండ్​కాని మాణిక్​ రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి

మహిళా కాంగ్రెస్​ మీటింగ్​కు అటెండ్​కాని మాణిక్​ రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి

అటెండ్​కాని నెట్టా డిసౌజా, మాణిక్​ రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి
అందుబాటులో ఉన్న నేతలతోనే సమావేశం​

హైదరాబాద్​, వెలుగు: గాంధీభవన్​లో మంగళవారం మహిళా కాంగ్రెస్​ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్​కు ఏఐసీసీ మహిళా అధ్యక్షురాలు నెట్టా డిసౌజా, ఏఐసీసీ స్టేట్​ ఇన్​చార్జ్​ మాణిక్​ రావు ఠాక్రే, పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి హాజరవుతారని తొలుత ప్రకటించారు. కానీ, వారు సమావేశానికి అటెండ్​ కాలేదు. ఉదయం 11.30 గంటలకు సమావేశం జరగాల్సి ఉన్నా.. సాయంత్రమైనా వారు రాలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల వారు హాజరు కాలేకపోయారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఫోన్​ ద్వారా నెట్టా డిసౌజా తన మెసేజ్ పంపించారని చెప్పాయి.

దీంతో అందుబాటులో ఉన్న నేతలతోనే సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ సెక్రటరీ రోహిత్​ చౌదరీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారితో పాటు పీసీసీ వైస్​ ప్రెసిడెంట్​ సంగిశెట్టి జగదీశ్​, ఎస్సీ సెల్​ చైర్మన్​ ప్రీతం, రోహిన్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్విజ్​ పోటీల బ్రోచర్​ను రోహిత్​ చౌదరి ఆవిష్కరించారు. రాజీవ్​ గాంధీ యూత్​ క్విజ్​ పోటీల్లో ఎక్కువ మంది మహిళలు పాల్గొనేలా పనిచేయాలని కార్యకర్తలకు మహిళా కాంగ్రెస్​ అధ్యక్షురాలు సునీతా రావు సూచించారు. పోటీలపై మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. 16 ఏండ్ల నుంచి 35 ఏండ్ల వయసున్న వాళ్లంతా క్విజ్​ పోటీలకు రిజిస్ట్రేషన్​ చేసుకోవాలని పిలుపునిచ్చారు. 7661899899 నంబర్​కు మిస్డ్​ కాల్​ ఇచ్చి పోటీలకు రిజిస్ట్రేషన్​ చేసుకోవాలన్నారు.