V6 News

ఇయ్యాల రాష్ట్రానికి ఠాక్రే

ఇయ్యాల రాష్ట్రానికి ఠాక్రే
  • ఇయ్యాల రాష్ట్రానికి ఠాక్రే
  • ఉమ్మడి నల్లగొండ, ములుగు, వరంగల్​ జిల్లాల్లో టూర్
  • శుక్ర, శనివారాల్లో హైదరాబాద్​లో వరుస మీటింగ్స్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ​రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ మాణిక్​రావు ఠాక్రే ఐదు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. మంగళవారం రాష్ట్రానికి వస్తున్న ఆయన.. ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కోదాడ.. బుధవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలతోపాటు నల్లగొండ లోక్​సభ సెగ్మెంట్ ముఖ్య నేతలతో ఆయన భేటీ అవుతారు. అదే రోజు హాత్​సే హాత్​ జోడో యాత్రలో భాగంగా ఇంటింటి ప్రచారంలో పాల్గొంటారు. అక్కడి నుంచి ములుగు వెళ్తారు. ఇటీవల మరణించిన డీసీసీ ప్రెసిడెంట్​ కుమారస్వామి కుటుంబాన్ని గురువారం పరామర్శిస్తారు. అక్కడి నుంచి వరంగల్​ వెళ్లి బీఆర్ఎస్​ నేతల దాడిలో గాయపడిన యూత్​ కాంగ్రెస్​ నేత తోట పవన్​ను పరామర్శిస్తారు. మాజీ స్పీకర్​ దుద్దిళ్ల శ్రీపాదరావు 86వ జయంతి వేడుకల్లోనూ పాల్గొంటారు. అదే రోజు హైదరాబాద్​ చేరుకుంటారు. శుక్రవారం పార్టీ ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఏఐసీసీ ఇన్​చార్జ్ కార్యదర్శులు, ముఖ్య నేతలతో సమావేశమవుతారు. శనివారం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఇన్​చార్జ్​ జనరల్​ సెక్రటరీ, పార్టీ మండల అధ్యక్షులతో సమావేశం కానున్నారు.