Manipur Issue: మోదీ సర్కార్ పై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం

Manipur Issue: మోదీ సర్కార్ పై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం

మణిపూర్ అంశంపై పార్లమెంటులో చర్చించాలన్న ప్రతిపక్షాల వాదనను మరింత బలం చేకూరేందుకు నేతలు నేడు అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై ప్రధాని మోదీ స్పందించాలని వర్షాకాల సమావేశాల ప్రారంభం నుంచి విపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ విషయంపై చర్చిస్తామని ఇటీవల ప్రతిపక్షాలకు కూడా లేఖ రాశారు. అయితే తాజాగా మోదీ సర్కార్ పై బీఆర్ఎస్ అవిశ్వాసం తీర్మానం పెట్టింది. బీఆర్ఎస్ తరపు నుంచి నామా నాగేశ్వరరావు ఈ తీర్మానాన్ని పెట్టినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రతిపక్షం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే డ్రాఫ్ట్‌ సిద్ధం కాగా.. ఈ రోజు లోక్‌సభలో ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీనిపై సమాధానం చెప్పడానికి, చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించినప్పటికీ.. ప్రధాని మోదీయే సమాధానం చెప్పాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి.

BRS MP Nama Nageswara Rao has also filed the No Confidence Motion against the Government. pic.twitter.com/TAdLp1fD2Q

— ANI (@ANI) July 26, 2023