పిల్లలతో పెండ తినిపించిన్రు.. వైరలైన వీడియో

పిల్లలతో పెండ తినిపించిన్రు.. వైరలైన వీడియో

తొర్రూరు, వెలుగు: మామిడికాయలు దొంగిలించడానికి వచ్చారంటూ ఇద్దరు పిల్లలను తోట కాపలాదారులు కట్టేసి కొట్టి పెండ తినిపించిన ఘటన మహబూబాబాద్​జిల్లా తొర్రూరు డివిజన్​ కేంద్రంలో చోటుచేసుకుంది. తొర్రూరులోని సాయినగర్​కు చెందిన ఇద్దరు పిల్లలు కంఠాయపాలెం శివారు  మామిడితోటలో కాయలు దొంగిలించడానికి వచ్చారంటూ కాపలాదారులు పట్టుకున్నారు. పిల్లల చేతులను కట్టేసి కట్టెలతో కొట్టారు. తాము దొంగతనానికి రాలేదని పిల్లలు చెప్పినా వినిపించుకోలేదు. పిల్లలతో పెండ తినిపించారు. ఈ ఘటన మొత్తాన్ని సెల్​ఫోన్​లో వీడియో తీసి లోకల్​ వాట్సప్​ గ్రూపులో పోస్టు చేశారు. దీంతో వీడియో ఒక్కసారిగా వైరలైంది. కుక్క కనిపించకపోవడంతో పిల్లలు తోటలోకి వెళ్లారని పోలీసులు చెప్పారు. పిల్లలతో దారుణంగా వ్యవహరించిన బోతల తండాకు చెందిన బానోత్​ యాకు, హచ్చు తండాకు చెందిన బోనోత్​ రాములుపై పలు సెకక్షన్ల కింద కేసులు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నట్లు  చెప్పారు.