ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన జారీ చేసింది. పలు ప్యాసింజర్, ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని రైళ్ల రాకపోకలను పాక్షికంగా నిలిపివేసింది. 2023 ఆగస్టు 14 నుంచి 20వ తేదీ వరకు అంటే వారం రోజుల పాటు పలు ప్యాసింజర్ ట్రైన్స్, ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది.
రైల్వే ట్రాక్ మెయింటెనెన్స్ పనుల కారణంగా.. మొత్తం 20 ప్యాసింజర్ రైళ్లతో పాటు, 22 ఎంఎంటీఎస్ రైళ్లను క్యాన్సిల్ చేస్తున్నట్లుగా తెలిపింది. ఈ సందర్భంగా ప్రయాణికులు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ఎంచుకోవాలని సూచించింది.