కామారెడ్డి, వెలుగు: ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ఫండ్స్ మంజూరు చేయాలని ఎమ్మెల్యే కె.మదన్మోహన్రావు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కోరారు. మంగళవారం హైదరాబాద్లో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
గత వానాకాలంలో వరదలకు కొట్టుకుపోయిన లింగంపేట మండలం లింగంపల్లి ఖుర్డు సమీపంలోని బ్రిడ్జి, అడవి లింగాల బ్రిడ్జిల నిర్మాణానికి ఫండ్స్కేటాయించాలని, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన ఫెండింగ్బిల్స్ఇవ్వాలని కోరారు. బ్రిడ్జిల నిర్మాణానికి తక్షణమే ఫండ్స్మంజూరు చేయాలన్నారు. ఇందుకు డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

