
- జిలెటిన్ స్టిక్స్, బ్యాటరీలు,విప్లవ సాహిత్యం స్వాధీనం
వెంకటాపురం, వెలుగు : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఆరుగురు మావోయిస్ట్ మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రాచలం – వెంకటాపురం ప్రధాన రహదారిపై సూరవేడు గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ టైంలో సూర్యాపేట గ్రామం నుంచి ఛత్తీస్గఢ్లోని కొత్తపల్లికి వెళ్లే రహదారిపై ఆరుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని తనిఖీ చేయగా విప్లవ సాహిత్యంతో పాటు 12 జిలెటిన్ స్టిక్స్, 6 బ్యాటరీలు, ఒక డిటోనేటర్, ఎలక్ట్రికల్ వైర్ కనిపించాయి.
వారిని బాడిసె సురేశ్, మడకం సందీప్, గట్టుపల్లి సంతోశ్, కట్టం అర్జున్, మడకం రాము, బాడిసె రవిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. తెలంగాణ – ఛత్తీస్గఢ్ అడవుల్లోని కాలిబాటల్లో బాబీ ట్రూప్స్ ఏర్పాటు చేయడంతో పాటు, ఇటీవల బెడం మల్లన్న దర్శనానికి వెళ్లిన టైంలో మందుపాతర పేలి ఓ మహిళ గాయపడిన ఘటనలో వీరు ప్రధాన నిందితులని పోలీసులు చెప్పారు.