ములుగు జిల్లాలో ఓ మాజీ సర్పంచ్ ను మావోలు కిడ్నాప్ చేయడం కలకలం రేపుతోంది. వెంకటాపురం మండలం సూరవీడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కురుసం రమేష్ ను నిన్న సాయంత్రం మావోలు కిడ్నాప్ చేశారు. ఏటూరునాగారం మండల కేంద్రానికి వెళ్లి వలస వెళ్లి నివాసం ఉంటున్నాడు రమేష్. అర్ధరాత్రి ఇద్దరు మావోయిస్టులు వచ్చి తన కొడుకును తీసుకెళ్లారని చెబుతున్నారు రమేష్ తల్లి. తన భర్తను కాపాడాలంటూ పోలీసులను ఆశ్రయించింది రమేష్ భార్య. రమేష్ కు ఎలాంటి హాని తలపెట్టకుండా విడిచి పెట్టాలని విజ్ఞప్తి చేస్తోంది అతని భార్యా. రమేశ్ దయతలచి తన పిల్లల మొహం చూసి తన భర్తను విడిచిపెట్టాలని కన్నీరుమున్నీరయ్యింది. అయితే మావోయిస్టు కొరియర్ గా రమేష్ పనిచేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
మరిన్ని వార్తల కోసం:
తాను చనిపోతూ.. ఏడుగురికి పునర్జన్మ
స్కూలు వాట్సాప్ గ్రూపులో.. పోర్న్ వీడియో
విద్యార్థుల కోసమే ఏడేళ్ల సర్వీసు త్యాగం చేశా