చెన్నై: ఆయనో లెక్కల టీచర్.. స్టూడెంట్లకు ఆదర్శంగా బతకాల్సినోడు. కానీ మద్యం తాగి, ఆ మత్తులో పాడుపని చేసిండు. స్కూలు వాట్సాప్ గ్రూపులో పోర్నోగ్రఫీ వీడియో పెట్టిండు. మేనేజ్మెంట్ కంప్లైంట్తో పోలీసులు ఆ టీచర్ను అరెస్టు చేసిండు. చెన్నైలోని ఓ ప్రైవేటు స్కూలులో జరిగిందీ ఘటన. అంబత్తూర్ ఏరియాలో ఉండే ఆర్ మాథివనన్ ఓ ప్రైవేటు స్కూలులో టీచర్. స్టూడెంట్లకు లెక్కలు చెప్తుంటాడు. పన్నెండో తరగతి స్టూడెంట్లు పబ్లిక్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు కూడా మాథివనన్ క్లాసులు తీస్కునెటోడు. కరోనా వల్ల ఆన్లైన్లో కూడా క్లాసులు చెప్తుండటంతో స్కూలు మేనేజ్మెంట్ పన్నెండో తరగతి స్టూడెంట్ల కోసం ఓ వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేసింది. ఈ గ్రూపులో శుక్రవారం రాత్రిపూట ఓ వీడియో మెసేజ్ వచ్చింది. ఏంటని కొంతమంది తెరిచి చూడగా.. అందులో పోర్నోగ్రఫీ కంటెంట్ ఉంది. ఎవరు పంపారని చూస్తే లెక్కల టీచర్ మాథివనన్ నెంబర్ నుంచి వచ్చింది. స్కూలు మేనేజ్మెంట్ వాళ్లు ఇంటర్నల్గా విచారించిన్రు. ఎందుకీ పాడుపని చేసినవని అడిగితే.. అదెలా జరిగిందో తెలియదని, ఆ టైమ్లో మద్యం మత్తులో ఉన్నానని చెప్పిండట. మేనేజ్మెంట్ వాళ్లు ఫిర్యాదు చేయడంతో పోలీసులు
మాథివనన్ను అరెస్టు చేశారు.