ఏఎస్ఐని హతమార్చిన మావోయిస్టులు

ఏఎస్ఐని హతమార్చిన మావోయిస్టులు

ఛత్తీస్ గఢ్ : బీజాపుర్: కుట్రు పోలిస్ స్టేషన్ ఏఎస్ఐ గా విధులు నిర్వర్తిస్తున్న కొర్సా నాగయ్యను మావోయిస్టులు హతమార్చారు. 10 రోజుల సెలవు మీద స్వగ్రామానికి వెళ్లేందుకు ఆదివారం టూ వీలర్ పై పయనమయ్యాడు. అయితే నైమేడ్-కుట్రుల మధ్యలో గల మంగపేట వద్ద మావోయిస్టుల ద్వారా అపరహణకు గురైయ్యాడు. సోమవారం తెల్లవారుజామున కుట్రు ప్రధాన ద్వారం వద్ద నాగయ్య శవమై కనిపించాడు. మృతదేహం వద్ద మావోయిస్టుల కర పత్రాలు లభ్యమయ్యాయి. కుట్రులోనే శవానికి పోస్టుమార్టం నిర్వహించారు. కుట్రు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ గౌరవ వందన అందించి అంత్యక్రియలు పూర్తి చేశారు.