
భద్రాచలం, వెలుగు: ఒడిశాలో మావోయిస్టులు 5 వేల కిలోల గన్పౌడర్ను ఎత్తుకెళ్లారు. సుందర్గఢ్ జిల్లా బరగావ్ పోలీస్స్టేషన్పరిధి ఇట్మా గ్రామంలో గోదాము నుంచి బుధవారం జార్ఖండ్బార్డర్లోని బ్యాంగ్ఐరన్క్వారీకి గన్ పౌడర్ను వ్యాన్లో తీసుకెళ్లారు. అక్కడికి నలుగురు మావోయిస్టులు వెళ్లి.. వ్యాన్ లోకి దించిన బ్యాగులను రీలోడ్ చేయించి డ్రైవర్ను బెదిరించి వ్యాన్ తో సమీప అడవుల్లోకి వెళ్లారు. అక్కడ సుమారు 40 మంది మావోయిస్టులు వ్యాన్లోని 25 కిలోల 200 గన్పౌడర్ప్యాకెట్లను తీసుకెళ్లారు.
డ్రైవర్ భయపడి వ్యాన్వదిలేసి పారిపోయాడు. గోదాము ఇన్ చార్జ్ అరుణ్కుమార్కు సమాచారం ఇవ్వడంతో బరగావ్పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఒడిశా పోలీసులు అలర్ట్ అయ్యారు. మావోయిస్టుల కోసం బలగాలను రంగంలోకి దించారు. జార్ఖండ్, చత్తీస్ గడ్ బార్డర్లోని ప్రాంతం కావడంతో పక్క రాష్ట్రాలకు కూడా సమాచారం ఇచ్చారు. పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను మావోయిస్టులు ఎత్తుకెళ్లడం ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తోంది.