సుందర్​గఢ్​ జిల్లాలో 5వేల కిలోల గన్​ పౌడర్ ఎత్తుకెళ్లిన మావోయిస్టులు

సుందర్​గఢ్​ జిల్లాలో 5వేల కిలోల గన్​ పౌడర్ ఎత్తుకెళ్లిన మావోయిస్టులు

భద్రాచలం, వెలుగు: ఒడిశాలో మావోయిస్టులు 5 వేల కిలోల గన్​పౌడర్​ను ఎత్తుకెళ్లారు. సుందర్​గఢ్​ జిల్లా బరగావ్​ పోలీస్​స్టేషన్​పరిధి ఇట్మా గ్రామంలో గోదాము నుంచి బుధవారం జార్ఖండ్​బార్డర్​లోని బ్యాంగ్​ఐరన్​క్వారీకి గన్ పౌడర్​ను వ్యాన్​లో తీసుకెళ్లారు. అక్కడికి నలుగురు మావోయిస్టులు వెళ్లి.. వ్యాన్​ లోకి దించిన బ్యాగులను రీలోడ్​ చేయించి డ్రైవర్​ను బెదిరించి వ్యాన్ తో సమీప అడవుల్లోకి వెళ్లారు. అక్కడ  సుమారు 40 మంది మావోయిస్టులు వ్యాన్​లోని 25 కిలోల 200 గన్​పౌడర్​ప్యాకెట్లను తీసుకెళ్లారు. 

డ్రైవర్​ భయపడి వ్యాన్​వదిలేసి పారిపోయాడు. గోదాము ఇన్ చార్జ్ అరుణ్​కుమార్​కు సమాచారం ఇవ్వడంతో బరగావ్​పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దీంతో ఒడిశా పోలీసులు అలర్ట్ అయ్యారు. మావోయిస్టుల కోసం బలగాలను రంగంలోకి దించారు. జార్ఖండ్, చత్తీస్ గడ్ బార్డర్​లోని ప్రాంతం కావడంతో పక్క రాష్ట్రాలకు కూడా సమాచారం ఇచ్చారు. పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను  మావోయిస్టులు ఎత్తుకెళ్లడం ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తోంది.