వాకింగ్ కు వెళ్తామని చెప్పి.. ఈతకు వెళ్లిన చిన్నారులు మృతి

వాకింగ్ కు వెళ్తామని చెప్పి.. ఈతకు వెళ్లిన చిన్నారులు మృతి

సిద్దిపేట జిల్లాలో ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారు మృతి చెందారు. మర్కుక్ గ్రామానికి చెందిన రాజు, సంపత్, వినయ్ అనే ముగ్గురు చిన్నారులు సోమవారం(నవంబర్ 27) ఉదయం 7.30 నిమిషాలకు వాకింగ్ కు వెళ్తామని ఇంట్లో చెప్పి.. మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ పంప్ హౌస్ దగ్గర పెద్ద కాలువలో ఈతకు వెళ్లారు. 

ఈతకు వెళ్లిన వినయ్(11), సంపత్(14) ఇద్దరూ నీటిలో మునిగి మృతి చెందారు. రాజు అనే చిన్నారికి ఈత రావడంతో అతను బయటపడ్డాడు. సంపత్, వినయ్ డెడ్ బాడీలను  బయకు తీశారు. ఈ ఘటనతో సంపత్, వినయ్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తు్న్నారు. చిన్నారుల మృతితో మర్కుక్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.