పేదల ఆకలి తీర్చేందుకే రూ.5 భోజనం: ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

పేదల ఆకలి తీర్చేందుకే రూ.5 భోజనం: ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: పేదల ఆకలి తీర్చేందుకు రూ.5 భోజనం క్యాంటిన్ ను ఏర్పాటు చేసినట్లు ఎంజేఆర్ ట్రస్ట్  అధినేత, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. బుధవారం క్యాంటిన్ ను ప్రారంభించి మాట్లాడారు. సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వివిధ పనుల మీద వచ్చే పేదలు, వృద్ధులు ఆకలితో ఇబ్బంది పడుతున్నారని, వారికోసం క్యాంటీన్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ప్రతి రోజు వెయ్యి మంది ఆకలి తీర్చేందుకు ఏర్పాటు చేశామని, 20 నుంచి 30 నిమిషాల్లో వంట అయ్యేలా అత్యాధునిక పరికరాలతో కిచెన్  నిర్మించినట్లు తెలిపారు. అన్నం, కూర, చట్నీ, సాంబార్, పెరుగు వడ్డిస్తారని చెప్పారు. ట్రస్ట్  ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ట్రస్ట్  డైరెక్టర్  మర్రి జమున, జక్క రఘునందన్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.